Français हिन्दी Português Deutsch Español English Українська Русский Català
భారతదేశంలో కొండలను తొలిచి నిర్మించిన రాతి గుహలలో అత్యంత పురాతనమైనవి బరాబర్ గుహలు. ఇవి బిహార్ లోని గయ జిల్లాలో వున్నాయి. క్రీ.పూ. 3 వ శతాబ్దానికి చెందిన ఈ రాతి గుహలు మౌర్య చక్రవర్తుల కాలం నాటివి. ఈ గుహలలో మౌర్య చక్రవర్తులు అశోకుడు, అతని మనుమడు దశరథుడు లకు చెందిన శిలా శాసనాలు లభించాయి. ఈ గుహలను మౌర్య చక్రవర్తులు తొలిపించి అజీవకులకు దానంగా ఇచ్చారు.