Suomi فارسی Tiếng Việt हिन्दी 日本語 Español English Русский Français 中文 Polski العربية Nederlands Deutsch Italiano Norsk (Bokmål)
నాగపట్నం, (గతంలో నాగపట్టినం లేదా నెగపటం అని పిలుస్తారు) భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలోని ఒక పట్టణం.ఇది నాగపట్నం జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఈపట్టణం మధ్యయుగ చోళుల కాలంలో (సా.శ. 9వ-12వ శతాబ్దం) ప్రాముఖ్యతను సంతరించుకుంది. తూర్పు వైపు నౌకాదళ యాత్రలకు, వాణిజ్యానికి.. ముఖ్యమైన నౌకాశ్రయంగా పనిచేసింది. రాజరాజ చోళ I సహాయంతో శైలేంద్ర రాజవంశానికి చెందిన విజయ రాజు మారా విజయత్తుం గవర్మన్ నిర్మించిన నాగపట్నంలోని చూడామణి విహారం ఆ కాలంలోముఖ్యమైన బౌద్ధ నిర్మాణం.