తిరువయ్యూరు

తిరువయ్యారు తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని పట్టణం. ఇది తిరువయ్యారు తాలూకాకు కేంద్రం. ఈ పురాతన చోళరాజ్య పట్టణం శ్రీత్యాగరాజస్వామి ఆలయానికి, ఏప్రిల్ నెలలో జరిగే రథోత్సవానికీ ప్రసిద్ధి గాంచింది. ఇది తంజావూరు నుండి 11 కి.మీ. ఉత్తరాన, కావేరి నది ఒడ్డున ఉంది. తిరువయ్యారు అంటే ఐదు నదుల పవిత్ర స్థలం అని అర్థం. వడవార్, వెన్నార్, వెట్టార్, జూడుమూరుత్తి, కావేరి అనే ఐదు నదుల మీదుగా ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది.

Wikipedia



Impressum