Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Svenska Euskara Català Lietuvių 日本語 Nynorsk Español 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నగరమే ప్రయాగ్ రాజ్. ఈ నగరానికి మరొక పేరు అలహాబాద్. ప్రయోగ్ రాజ్ జిల్లాకు ఇది ప్రధానకేంద్రం. ఉత్తర ప్రదేశ్ నగరాలలో జనసాంద్రతలో అలహాబాద్ 7వ స్థానంలో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి అలహాబాద్ నగరం, జిల్లా ప్రాంతంలో జనసంఖ్య 17.4 లక్షలు. ప్రపంచంలో అత్యంతవేగంగా అభివృద్ధిచెందుతున్న నగరాలలో అలహాబాద్ 130వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబద్ అతిపెద్ద వాణిజ్య కేంద్రం. తలసరి ఆదాయంలో 2వ స్థానం, జి.డి.పిలో మూడవస్థానంలో ఉంది. అలహాబాదు నగరానికి ప్రధానమంత్రుల నగరమన్న ఖ్యాతి ఉంది. భారతదేశ 13 మంది ప్రధానమంత్రులలో 7 మంది (జవహర్ లాల్ నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, గుల్జారీ లాల్ నందా, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్) ప్రధానమంత్రులు అలహాబాదు వాసులే. వీరంతా అలహాబాదులో జన్మించడం, అలహాబాదు విశ్వవిద్యాలయంలో చదువుకోవడం లేక అలహాబాదు నుండి పార్లమెంటుకు ఎన్నిక కావడం జరిగాయి.