కచ్చాతీవు లేదా కచ్చ దీవులు శ్రీలంక లోని ఒక చిన్న దీవి .1974 లో మనదేశ, శ్రీలంక ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, సిరిమావో బండారు నాయకే మధ్య, రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన చర్చల మేరకు (కరుణానిధి హయాంలో) కచ్చాతీవును శ్రీలంకకు ధారాదత్తం చేసినట్టు కేంద్రం చెబుతోంది. తాజాగా దీనిని భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు రాజకీయ పార్టీలు కోరుతుండటంతో ఇది వార్తలలో నిలిచింది.