Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Português Español English ไทย Română 한국어 Français 中文 Українська Polski Magyar Svenska Русский العربية Nederlands Čeština Deutsch Euskara Italiano Norsk (Bokmål) Català Türkçe Српски / Srpski
విశాఖపట్నం (విశాఖ , వైజాగ్, వాల్తేరు) భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరం, అదే పేరుగల జిల్లా కేంద్రం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సముద్రం లోకి చొచ్చుకొని ఉన్న కొండ " డాల్ఫిన్ నోస్ (విశాఖ) " అలల తాకిడిని తగ్గించి సహజ సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా వుంది. 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా అమరావతిని శాసనరాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రతిపాదించాడు.