中文 Deutsch Tiếng Việt English Bahasa Melayu Svenska Italiano
ఎమ్మిగనూరు (యెమ్మిగనూరు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం, అదే పేరుగల మండలానికి ఇది కేంద్రం. ఇది మంత్రాలయం నుండి 22 కిమీ దూరంలో కర్నాటక సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరిలో "శ్రీ నీలకంఠేశ్వర జాతర" ఘనంగా జరుగుతుంది. ఈ పట్టణం చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి.