పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రప్రభుత్వంచే 1985లో స్థాపించబడిన ఒక విద్యాసంస్థ. దీని పరిధి కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కలదు. భారతదేశంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టిన మొదటి సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని బంగాళా ఖాతానికి ఆనుకొని 780 ఎకరాల్లో నిర్మింపబడింది. ఇది చెన్నై నుండి 168 kms దూరంలో కలదు. మాహే, కారైకల్, యానాం ,లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు కలిపి మొత్తం 93అనుబంధ కళాశాలలు, కమ్యూనిటీ కళాశాలలు కలవు. పాండిచ్చేరి ఇంజనీరింగ్ కళాశాల(PEC) దీనికి ఆనుకొని ఉంది, అది దీనికి అనుబంధంగా నడుస్తున్నది. పాండిచ్చేరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (PIMS) దీని నియంత్రణ లో నడుస్తున్నది. క్యాంపస్ లో విద్యార్ధులు మొత్తం 6315 మంది, అనుబంధ కళాశాలలు, దూరవిద్యా ద్వారా కలిపి 72,671 విద్యార్ధులు 2018 లెక్కల ప్రకారం చదువుతున్నారు