Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Português Српски / Srpski Español English Русский Română 한국어 Français 中文 Українська Polski Magyar ไทย العربية Čeština Deutsch Italiano Norsk (Bokmål) Català Türkçe Svenska
గుంటూరు, దక్షిణ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా లోని ఒక ముఖ్య నగరం, ఈ నగరం 7,43,354 జనాభాతో (2011 జనగణన) రాష్ట్రం లోని మూడవ పెద్ద నగరంగా రికార్టులకెక్కింది. గుంటూరు ప్రాంతం విద్యా, వైద్య రంగాలకు పేరొందింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోకి వచ్చింది. గుంటూరు నగరపాలకసంస్థ ద్వారా పరిపాలనజరుగుతుంది. ఇది గుంటూరు రెవిన్యూ విభాగంలోని గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ మండలాల కేంద్రం. విశాఖపట్నం గుంటూరు పారిశ్రామిక ప్రాంతంలో భాగం. మిరప, పత్తి, పొగాకు ఎగుమతులకు ప్రసిద్ధి గాంచింది. ఆసియాలో అతి పెద్ద ఎండమిర్చి మార్కెట్ కలిగివుంది.