బంగారుపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, బంగారుపాలెం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. బంగారుపాళ్యం జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో మద్రాసు - బెంగుళూరు, జాతీయ రహదారి 4 పై ఉంది. బంగారుపాలెం మామిడి పళ్లకు ప్రసిద్ధి. చుట్టుపక్కల గ్రామాలలో చాలామంది రైతులు మామిడి తోటలను నిర్వహిస్తున్నారు.