హిరమండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా, హీరమండలం మండలానికి చెందిన ఒక జనగణన పట్టణం. హిరమండలం వంశధార నది ఒడ్డున ఉంది. సమీపాన ఉన్న గొట్ట అనే గ్రామం వద్ద వంశధార నదిపై బ్యారేజి నిర్మించారు. దీనినే "గొట్టబ్యారేజీ" అంటారు. ఈ బ్యారేజీలో నీరు ఎక్కువైతే దిగువ ప్రాంతాలకు వదులుతారు. దీనివలన నది ఒడ్డున ఉన్న గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం బ్యారేజీకి రెండు కిలోమీటర్లు దూరంలో విశాలమైన ప్రదేశంలో నీటిని నిల్వ ఉంచుటకు రిజర్వాయర్ను నిర్మిస్తోంది