Suomi فارسی Tiếng Việt Bahasa Melayu हिन्दी 日本語 Português Español English Русский 한국어 Français 中文 Українська Polski Svenska العربية Nederlands Čeština Deutsch Italiano Norsk (Bokmål) Català
మచిలీపట్నం (బందరు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన తీర నగరం, జిల్లా కేంద్రం. ఇక్కడ 350 పడవల సామర్ధ్యం గల సన్నకారు చేపల రేవు ఉంది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, బందరు లడ్డులకు ప్రసిద్ధి. ఇక్కడి తీరప్రాంతం తరచు తుఫాను, వరదల బారిన పడుతుంటుంది. బియ్యం, నూనె గింజలు, బంగారపు పూత నగలు, వైజ్ఞానిక పరికరాలు ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు.